Tuesday, March 22, 2011

తీన్ మార్ నిర్మాత గణేష్ బాబు వెనుక ఓ మంత్రిగారు....

సినిమా పరిశ్రమలో రచయితలకు.దర్శకులకు, ఘోస్ట్ రైటర్ లు ఉంటారు అనే మాట విన్నాం. వాళ్ళు రాసిపెడితే వీళ్ళు తమ పేరును వేసుకొంటారు అని చాలామంది దర్షకుల విషయం లో పుకార్లు ఉన్నాయ్. మరి నిర్మాత లకు కూడా ఘోస్ట్ ప్రోడుసార్లు అదేనండి  తాము డబ్బు పెట్టి వేరేవారి పేర్లు వేయించే వాళ్ళు ఉంటారా? అంటే అవుననే అంటున్నాయ్ టాలివుడ్ వర్గాలు. గణేష్ (ఈ మద్యనే ఈయన పేరు లోకి బాబు వచ్చి చేరింది లెండి )చాలా కలం నుంచి కామెడీ  యాక్టర్  గా పరిచితుడే. రెండేళ్ళ క్రితం రవితేజ తో తీసిన ఆంజనేయులు తో నిర్మాత గా మారాడు గణేష్. అప్పు అందరు షాక్ అయ్యారు. గణేష్ కి అంత డబ్బు ఎక్కడిది! అను కొన్నారు. ఆ తరువాత మరిన్ని షాక్ లు ఇచ్చాడు గణేష్. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా మొదలేట్టెశాడు. అప్పుడే ఒక వార్తా బయలుదేరింది. గణేష్ ఏ రియల్ ఎస్టేట్ తో డబ్బు సంపాదిం చలేదని ఓ రాజకీయ నాయకుడు గణేష్ పేరు మీదుగా సినిమా లకు పెట్టుబడి పెడు తున్నడనే వార్తలు వినిపించాయి. అతడు ఎవరన్నది    బహిరంగ రహస్యమే. గణేష్ సామాజిక వర్గానికే చెందినా ఆ మంత్రి ఈ పెట్టుబడులు పెడు తున్నదనేది వాస్తవమో కాదో తెలియదు కాని తీన్ మార్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి కూడా ఆ మంత్రి వర్యులు సతీ సమేతంగా విచ్చేయటం మాత్రం వాస్తవమే.....

Sunday, March 20, 2011

'రెడ్డి గారు పోయారంటున్న' రామ్ గోపాల్ వర్మ....

రామ్ గోపాల్ వర్మ మరో తను చేయబోయే మరో సంచలనాన్ని ప్రకటించారు. ఈ సారి తన అస్త్రం ఆంద్ర రాష్ట్ర రాజకీయాలపై ఎక్కుపెట్టాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం పై సినిమా తర్వాతా కనీసం పాటల తో నైనా సినీ జనాల పై సెటైర్ వేసాడు అప్పలరాజు తో. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్తితు నేపథ్యంతో ''రెడ్డి గారు పోయారు''సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు వర్మ. కనీస సెన్స్ ను ఉపయోగించి ఆలోచించినా అది వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత మలుపులు తిరుగుతోన్న రాష్ట్ర రాజకీయాల పై సెటైర్ అని చెప్పేయొచ్చు. ఎదేమైనా ఈ చిత్రం తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది అనటం లో ఎటు వంటి ఆశ్చర్యం లేదు. ఈ చిత్రం లో చిరంజీవి పాత్ర ఏంటి అనేదాని పై అప్పుడే ఊ హాగానాలు మొదలయ్యాయి. ఇది వరకే కాంగ్రెస్ చిరు పోత్తు లో చిరు హీరో కాదు హీరొయిన్ వంటివాడని వ్యాఖ్యానించిన వర్మ ఇప్పు ఏ నాయకుడిని ఎలా చుపుతాడనే ఆసక్తి నెలకొంది.....

Friday, March 18, 2011

అయ్యారే...నిత్యానంద పై మరో సినిమా....

రంజిత తో రక్తిని సీన్లతో దొరికిపోయిన నిత్యానంద స్వామి సినిమా వాళ్లకి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే పలు సినిమాల్లో కామెడీ బాబా లను మనం  చూస్తుండగా, తెలుగులో నిత్యానంద రాసలీలను నటకిరీటి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో నిత్యనంద తన పరువు పోతోందంటూ కోర్ట్కి కూడా ఎక్కాడు. ఇదిలా ఉంటే నిత్యానంద స్వామి లీలలను తెరకెక్కించే పనిపడ్డాడు ఓ కన్నడ  నిర్మాత ఈ సినిమాకి ''సత్యానంద'' అని టైటిల్ పెట్టారు. ఈ సిన్మా విషయంలో నిత్యానంద గురూజీ కోర్ట్ కి ఎక్కే అవకాశం లేదంటున్నాడు ఈ నిర్మాత. తను ఇప్పటికే 14  మంది న్యాయవాదులను సంప్రదించానని ఎటు వంటి చట్ట పరమైన చర్యలకైనా సిద్ధం అని ఈయన అంటున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ నిర్మాత బీజేపీ పార్టీ కి చెందినా వ్యక్తి. ఇప్పటికే ఈ ''సత్యానంద'' స్టిల్స్ శాడిల్ వుడ్ ని ఊపెస్తున్నాయి. మరి రంజిత పాత్ర ఏస్థాయిలో ఉంటుందో తెలియాల్సి ఉంది. చూద్దాం ఈ సత్యానంద లీలలు ఏ స్థాయిలో ఉంటాయో....

అందాల భామల కోల్డ్ వార్....

వారిద్దరూ అందాల భామలే.హీరొయిన్ లుగా మంచి పేరు తెచుకోన్నవారే. అయితే ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి అవకాశాలను  మరొకరు చేజిక్కిన్చుకోనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారిద్దరి మద్య చాలాకాలం నుంచి కోల్డ్ వార్ జరుగుతోంది. వారే కేరళ కుట్టి అసిన్,తమిళ ముద్దు గుమ్మ త్రిష టాలివుడ్ ,కోలివుడ్ ల మీదుగా బాలివుడ్ లోకి ప్రవేశించిన వీరి మద్య పోటి తీవ్ర స్థాయి లో ఉంది. సినిమా ల విషయం లోనే కాదు యాడ్స్ విషయం లో కూడా వీరు పోటి పడుతున్నారు. అసిన్ చాలా కాలంగా మోడల్ గా వ్యవహరిస్తున్న ఓ సౌందర్య సాధన  ప్రకటనను త్రిష కొట్టేసారట ఈ యాడ్ కు సంభందించి గత వారం షూటింగ్ జరిగింది. దీంతో వీరిద్దరి మద్య శత్రుత్వం మరింత పెరిగిందని సమాచారం. రజిని కాంత్ సరసన రాణా లో నటించే అవకాశం  వచ్చినట్టే వచ్చి చేజారి పోవటం తో మనస్తాపానికి గురైన అసిన్ కు త్రిష  దెబ్బ పుండు మీద కారం చల్లినట్లు అయ్యిందట.

Thursday, March 17, 2011

అందాల ప్రియమణి కోరిక....

 ప్రియమణి చాలా ఏళ్ళ కిందటే జాతీయ అవార్డు పొందిన తార. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం లైం  లైట్   లో ఉన్న హీరొయిన్ లలో జాతీయ అవార్డ్ పొందిన ఏకైక నటి ప్రియమణి.
అటు అందాన్ని, అభినయాన్ని కలిగిఉన్నా ప్రియమణికి తగిన గుర్తింపు రాలేదనే చేప్పాలి. ఈ మద్య వస్తున్న సినిమా లలో బికిని లతో హాట్ గ మారి ఇతర హీరొయిన్ లకు పోటీని ఇస్తోంది. ప్రియమణి. ఆమె ప్రస్తుత కోరిక ఒకటేనట..అది ఎలాగైనా నెం వన్ అనిపించు కోవట మేనట. ప్రతి చిత్రం తోను వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న తనకు ఆ అర్హత ఉండనే అంటోంది ప్రియమణి. సినిమాల్లో నిలబడాలంటే గ్లామర్ ఎంతైనా అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. కథ డిమాండ్ మేరకు గ్లామర్ ని ప్రదర్శించడానికి తాను ఎప్పుడు సిద్ద మేనని మరోసారి స్పష్టం చేసింది ప్రియమణి. ఇంకో ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే ప్రస్తుతం ఆమె బాలివుడ్ సినిమా ఫ్యాషన్ కు రీమక్ గా తెరకెక్కు తున్న ఓ చిత్రం లో నటిస్తోంది. ఫ్యాషన్ సినిమా కు గాను ప్రియాంక చోప్రా జాతీయ అవార్డ్ అందుకొంది. మరి ప్రియమణి కుడా మరోసారి జాతీయ అవార్డు అందు కొంటుందా...  అంటే చూడాలి మరి   మ రి  అల్ ది బెస్ట్ ప్రియమణి.....

Tuesday, March 15, 2011

ఫిబ్రవరి14 కి అమర ప్రేమికులు మార్చ్14 కి విఫల ప్రేమికులు

ఈ ఇయర్ వాలెంటైన్స్ డే న టీవీ చూసారా...ఆరోజు అన్ని చానల్స్ లోను ఓ ప్రేమజంట కనువిందు చేసింది.. ప్రేమంటే తమదేనని లేచిపోయి పెళ్లి చేసుకొన్నా ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి అందంగా ఉంటున్నామని నవ్వుతూ చెప్పుకొన్నారు. ఆరోజు  అందరు వింతగా చుసిన ఆ జంటే శిరీష్ భరద్వాజ్,శ్రీజల జంట. చిరజీవి కుమార్తె ఇంట్లో వాళ్లకి ఇష్టం లేని పెళ్లి చేసుకొందన్న విషయం తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తురువాత ఓ పాపా పుట్టిన తర్వాతా చిరు కుటుంబం వారిని ఆడరించిన్దనే వార్తలు వినిపించాయి. కొన్ని ఫంక్షన్ లలో శ్రీజ కనిపించింది. గత పిబ్రవరి 14 న మాత్రం వీరు వీర విహారమే చేశారు. తమ ప్రేమకథను అన్ని చానల్స్ లోను ప్లే చేసారు. సర్రిగ్గా నెల తిరిగింది అంతే తన భర్త,అతని కుటుంభ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది శ్రీజ. అరె నెల కిందటి వరకు బాగానే ఉన్నారు కదా! అప్పు డే ఏమైంది అని మరోసారి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది చిరు తనయ. మరి వీరి ప్రేమ,పెళ్లి కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి........

Monday, March 14, 2011

కలిసి ఉండట్లేదు,విడిపోలేదు అంటున్న తార.....

తానూ ఒంటరిగా ఉంటున్న మాట వాస్తవమే అయిన గాని అలాగని తన భర్త నుంచి తానూ విడిపోతున్నానే వార్తలు నిజం కాదంటున్నారు భూమికా చావ్లా. కొన్ని పరిస్తుతుల్లో తానూ ముంభై లో ఉంటున్నానని భరత్ హైదరాబాద్ లో ఉంటున్నదాని భూమిక తెలిపారు. సినిమాలు ఫెయిల్ అవటం సాధారనమేనని ,వ్యాపారాల్లో నష్టాలు కూడా మామూలేనని భూమిక  సెలవిచ్చారు. తన భర్తకు కోపం ఎక్కువని తానూ మాత్రం శాంత   స్వభావినని భూమిక అన్నారు. భార్య,భర్తలు ఇద్దరి మనస్తత్వం ఒకే ఉండాలని ఎక్కడా లేదని ఆమె అంటున్నారు. ఇంత చేసినా తన భర్తతో తన సఖ్యత గురించి మాట్లాడలేదు ఆమె. తల్లి ఆరోగ్యం కోసమే తను ముంబై ఉంటున్నాని భూమికా తము విడిగా ఉండటానికి కారణాన్ని తెలిపారు. అయన ఎప్పుడు నా వెంటే ఉండటం సాధ్యమా అంటున్న భూమికకు  గతంలో  ఏ ఫంక్షన్ లో నైనా తలుక్కున మెరిసే తమ జంట గురించి గుర్తుకురాలేదంటారా..........