Sunday, February 27, 2011

నాగార్జునకు అవార్డ్ తో ఎవరికి లాభం.....


మొత్తానికి నాగార్జున లలిత కళా రత్న అయ్యాడు. ( దీనికి అర్థమేంటబ్బ... ఏమన్నా లలిత కళల కు సంబంధించినదా...). దీనికి అర్థం బిరుదు ను గ్రహించిన వ్యక్తికి,బిరుదును ప్రధానం చేసిన వ్యక్తికి తెలీకపోయినా(అవార్డు ప్రదాన ఫంక్షన్ లో వారు దీనికి అర్థం చెప్పలేదు మరి ) బిరుదు ఇచ్చిన వ్యక్తి కళాబందు  కాబట్టి దీనికి విలువ నివ్వాలిసిందే. అయినా నాగ్ కు ఇంత అర్జెంటు గా అవార్డ్ నివాల్సిన అవసరం ఏ మొచ్చింది.( చిన్న వయసే కదా ). పైగా కారణం ఏం చెప్పలేదు. అయినా సుబ్బరామి రెడ్డి గురించి తెలిసిన వారెవరైనా ఈ అవార్డ్ ను లైట్ గా  తీసుకొంటారు. ఎందుకంటె ఈ కళాబందు అవార్డ్ లు ఇవ్వంది , సన్మానాలు చెయ్యంది ఎవరికి చెప్పండి. సన్మానాలు, పార్టీ ల విషయంలో డిల్లి స్థాయిలో ప్రసిద్ధి ఈ నెల్లూరు రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కు వెళ్ళే శ్రీమాన్ సుబ్బరామి రెడ్డి గారికి చిత్ర సీమతో చాలా దగ్గరి సంభందాలున్నాయి. గత 30  ఏళ్ళుగా తరచూ పార్టీ లతో సన్మానాలతో పరిశ్రమలోని అన్ని వర్గాలతో ఆయన సంపాదించుకొన్న సాన్నిహిత్యం అది. తెలుగు సినిమాకు సంబంధించి ఎవరికి పద్మ పురస్కారాలు వచ్చినా అందులో సుబ్బరామి రెడ్డి గారి ప్రమేయం ఉందనే మాట వినిపిస్తూ ఉంటుంది. మరి ఆయన మంచి లాబీయిస్టు మరి. వారిని కాంగ్రెస్ కు దగ్గరచేస్తానని అధిష్టానానికి చెప్పుకొని తన రాజ్యసభ సభ్యత్వాని పోదిగించుకోవటం రివాజు. చాలా కాలం నుంచి ఫంక్షన్ అరీన్జ్ చేయని కరువును దీంతో తీర్చుకొన్నాడు సుబ్బరామి రెడ్డి. కాని నాగార్జునకు అవార్డ్ ఏంటి అనే సందేహానికి అవకాశం ఇచ్చాడు ఆయన. దీనికి బదులు ఆ అవార్డ్ ఏదో అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చి ఉంటె సరిపోయేది కదా. అవార్డ్ యివ్వటానికి,తీసుకోవటానికి అడ్డేముంది......

Saturday, February 26, 2011

రజని కాంత్ తో నీళ్ళు తాగించిన రామ్ గోపాల్ వర్మ..........


టీవీ 9 రజినీకాంత్ అవతలి వాళ్ళను ఇరుకున పెట్టె ప్రశ్నలు అడిగి వారి వైపు విషపు నవ్వు చిందించటం ఇతని అలవాటు...తన ప్రశ్నలతో వారిని హింస పెట్టడం కుడా రజిని కాంత్ నైజం. అయితే తొలిసారి రజిని కాంత్ తను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చేతిలో చావుదెబ్బ తిన్నాడు. అతిధి గా వచిన్న ఆ వ్యక్తి మాటలతో రజని కాంత్ నీళ్ళునమిలాడు. రజినీకాంత్ పొగరును అనిచిన ఆ అతిధే రాంగోపాల్ వర్మ. టీవీ 9  వాళ్ళు వర్మ గురించి రామ్ ధమాల్ వర్మ పేరుతో వర్మ ఫై తీవ్రస్థాయిలో సెటైర్ లు వేశారు. దానిపై వర్మ కమిషనర్ ఏ కే ఖాన్ కు పిర్యాదు చేశాడు. అంతటితో వదిలేయాల్సిన అ విషయాన్ని టీవీ 9 మళ్లీ కెలికింది. వర్మను ఛానల్ కు పిలిపించి  మళ్లీ    చర్చ పెట్టింది. ఈ సారి గత ప్రోగ్రామ్లో పాల్గొన్న విశ్లేషకులనే పిలిపించి తాము చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవాలని రజినీకాంత్ ప్రయత్నించాడు. అందరిమీద లాగే వర్మ మీద కూడా డ్యామినేషన్ చేయాలని  చూసిన రజిని ప్రయత్నాలకు వర్మ మంచి సమాధానాలే ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు బుల్లెట్ లాంటి సమాధానాలు ఎటుతిరిగీ తమ ప్రోగ్రాం ను కరెక్ట్ అని కవర్ చేసుకోవాలన్న రజని ప్రయత్నాలు ఫలించలేదు. అసలు తన ఆలోచనలు తప్పు అని చీప్పడానికి టీవీ 9  ఎవరని వర్మ సూటిగా  ప్రశ్నిన్చా డు . తానవి నెగిటివ్  ఆలోచనలు అనే నైతిక హక్కు టీవీ 9 కు లేదని ఉదయం లేస్తూనే టీవీ 9 చేసే పనేంటని సూటిగా ప్రశ్నించాడు. పెద్ద మానసిక వైధ్యుడినని  చెప్పుకొనే యండమూరి వీరేంద్రనాథ్ కు గాలి తీసి పంపించాడు వర్మ. ఆఖరికి తనని తాను రక్షించు కొనే పనిలో పడిపోయాడు రజినీకాంత్. అందరిని తన మాటలతో ఆడుకొనే రజని కాంత్, వర్మ ముందు తేలిపోయాడు. అందుకే వర్మ లాంటి దారి తప్పిన మేధావులతో బీ కేర్ ఫుల్....

Thursday, February 24, 2011

''వారు నన్ను అవసరాలకు వాడు కొన్నారం''టున్న హీరొయిన్

తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే నటి లక్ష్మి రాయ్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. చిత్ర సీమలోని కొందరు వ్యక్తులు తనను తమ అవసరాలకు వాడుకొన్నారని ఈమె అంటోంది. ఈ మాటలు ఇప్పుడు చర్చనీయా  అంశాలు గా మారాయి. ఆవ్యక్తుల పేర్లు తను వెల్లడిన్ చలేనని కుడా ఈ భామ పేర్కొంది. తోటి నటులతో చెట్టపట్టాలు వేసుకు తిరుగుతుంది అని కూడా ఈమేకు పేరుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని తో ప్రేమాయణం సాగించిన లక్ష్మి రాయ్ ఆ తరువాత తాము స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏ లాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. మళ్లి  ఇప్పుడు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నదో తెలియక చిత్రపరిశ్రమ పెద్దలు తలలు పట్టుకోన్ టున్నారు. మరో వైపు లక్ష్మి రేయ్ ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ను పోగడ్తల  తో ముంచేస్తోంది. కాని ఈమె ఒక విషయం గుర్తుంచుకోవాలి సచిన్ ధోని లాంటి వాడు కాదు..........

Wednesday, February 23, 2011

ఈ బుల్లెట్ తెలుగు లో కూడా కనిపించేనా.......

పద్మశ్రీ కమలహాసన్ కు జంటగా బాలివుడ్ క్రేజీ హీరోయిన్, షాట్ గన్ కూతురు సోనాక్షి సిన్హా నటించనుం ది  అనేది తాజా వార్త ఏదేదో తమిళ సినిమా వార్త అని అనుకోకండి. తమిళం లో భారి స్థాయి లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ,  తెలుగులోకి  డబ్ అవుతుంది దాన్ని మనం ఇంటరెస్టింగ్ గా చూస్తాం. దబంగ్ తో బాలివుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నా సోనాక్షికి అవకాశాలు వేల్లువేత్తు తున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే  కమల్ హాసన్ కు ఇప్పుడు 56 ఏళ్ళ. కమల్  కూతురు శ్రుతి కంటే సోనక్షి ఏడాది చిన్నది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలాగు సౌత్ లోకి వస్తున్నా ఈ బుల్లెట్ ను పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ కు కూడా తీసుకొంటే బాగుంటుంది కదా.......

Sunday, February 20, 2011

విడిపోనున్న భూమిక దంపతులు..

భూమిక తెలుగు సిని అభిమానులకు పరిచయం ఆఖర్లేని పేరిది. తన నటనతో మంచి గుర్తింపు తెచుకొన్న భూమిక అవకాశాలు తగ్గిన తరువాత యోగా గురు  భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు. అంతకు ముందు నుంచే అతని తో భూమికకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. పెళ్లి తర్వాతా వీరు హైదరాబాద్ లోనే ఉంటూ కొన్ని రకాల వ్యాపారాలు చేసారు. పెళ్లి తారు వాత భూమిక కొన్ని సినిమాల్లో హీరొయిన్ గా చేసింది.వీరు కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఒక సినిమా మాగజిన్ ను ప్రారంభించారు. అతరువాత ఎం జరిగిందో గాని ఆ పత్రిక ఆగిపాయింది. మొదటి సినిమా ఫెయిల్ అవటంతో మల్లి సినిమాల జోలికి రాలేదు. ఇది లా ఉండగానే భరత్ ఠాకూర్ దుబాయి లో ఒక యోగా స్కూల్ ప్రారంభించారు. అది కుడా వీరికి నష్టాలనే తెచ్చి పెట్టింది. వరుస ఆర్ధిక నష్టాలతో వీరి మద్య స్పర్ధలు పెరిగాయి. దాంతో అనేక మంది సిని జంటల్లనే విడి పోవడమే దీనికి పరిష్కారం అనుకోని విడాకుల కోసం హై కోర్ట్ కు అప్లై చేసారు. భరత్ మల్లి యోగా నే నమ్ము కొంటుండగా భూమిక మళ్లీ   తెరపై కనిపించడానికి అవకాశాలను  వెదుక్కొనే పనిలో పడింది. ఇంకే ముంది సినిమా వాళ్ళ బంధాలు   మూన్నల్ల   ముచ్చట్లే అని మరోసారి నిరూ పించారు భూమిక, భరత్ ఠాకూర్ లు........





Saturday, February 19, 2011

రీమాసేన్ వెడ్డింగ్ బెల్స్.....

రీమా సేన్  కు పెళ్లి కళ వచ్చేసింది.....మనసంతా నువ్వే అంటూ తెలుగు వారికి పరిచయం అయిన ఈ బెంగాలి భామ  పెళ్ళికూతురు కాబోతోంది. త్వరలోనే రీమాసేన్ వెడ్డింగ్ బెల్స్ మొగించనుంది. డిల్లీ  కి చెందినా వ్యాపారవేత్త శివ కరణ్ సింగ్ ను రీమాసేన్ వివాహమాడనుంది. గత బుధవారం రాత్రి వీరి నిశ్చితార్థం ఘంగా జరిగింది. రీమ కు ఆమె ప్రియుడే తొలుత లవ్ ప్రపోజ్ చేశాడట. ఆమె కూడా ఓ కే అనటంతో వీరి   పెళ్ళికి గ్రీన్ కార్డు పడింది . అందరికి వెడ్డింగ్ కార్డు అందించే పనిలో పడింది రీమాసేన్. తాము తొలి ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తున్నామని పెళ్ళికి ఇంకా తేది ఖారారు చేయలేదని శివ కరణ్ అంటున్నారు.

Thursday, February 17, 2011

వారిది హీరొయిన్ ల కుటుంబం కూడా....


చిత్రసీమతో సంబంధం ఉన్న కుటుంబాల నుంచి అనేకమంది అబ్బాయి లు హీరోలుగా తెరకు పరిచయం అవుతారు కాని హీరోఇన్లు మాత్రం ఈ కుటుంబాలనుంచి రావటం అరుదు. మరి ఈ రంగం మీదున్న చిన్నచూపె కారణమో లేక తమ అమ్మాయిలను  హీరోయిన్ లు గా చేడలేక కొడుకులను ఈజీ గా హీరో లను చేస్తూ కుతుర్లను సిని రంగానికి దూరంగా ఉంచుతారో తెలియదు గాని సిని కుటుంబాల నుంచి హీరొయిన్ లు రావటం దక్షిణాదిలో అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన కుటుంబంలో ముందుండేది కమలహాసన్ కుటుంబం. ఒక సూపర్ స్టార్ ఇంటినుంచి నటీమణులు రావటం అనేది కమల్ కుటుంబానికి మాత్రమె పరిమితం. కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ నటిగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నాలు చేస్తుండగానే ఇప్పుడు కమల్,సారిక ల  రెండో కూతురు అక్షర హీరొయిన్ గా పరిచం కానుంది. తన ఇద్దరు కూతుర్లు హీరొయిన్ లు కావటానికి కమల్ ఏ మాత్రం అభ్యంతరం చెప్పక పోవటం విశేషం కదా. ఇంతే కాదు కమల్ అన్న చారుహాసన్ కూతురు సుహాసినిని కూడా కమల్ దగ్గరుండి హీరొయిన్ చేశాడు. చిన్న వయసు లోనే నాకు స్టూడియో కట్టిస్తానని చెప్పి కమల్ తనను హీరొయిన్ చేశాడని నవ్వుతు చెబుతారు సుహాసిని. ఆమె మంచి నటి గా సక్సెస్స్ అయ్యింది కూడా అంతే కాదు కమల్ రెండో భార్య సారిక కూడా హీరోఇనే. సినిమా ఫీల్డ్ మీద ఏ మాత్రం చిన్న చూపు లేకుండా ఇంట్లో వాళ్ళను హీరొయిన్ లు గా చేస్తున్న కమల్ ను మన తెలుగు సిని కుటుంబాలతో పోల్చవచంటారా.....

Wednesday, February 16, 2011

రాణా లో ముగ్గురు రజినీకాంత్ లు.....



రోబో సినిమా తరువాత రజినీకాంత్ రాణా అనే చిత్రానికి సిద్దం అయ్యాడు. రోబోలో సైంటిస్ట్ గా యంత్రుడిగా రెండు పాత్రలు చేసినా రజిని రాణా లో త్రి పాత్రాభినయం చేయనున్నాడు. భారి చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన కే ఏస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ముగ్గురి రజినిల సరసన ముగ్గురు గ్లామర్ బొమ్మలను  కుడా అప్పుడే సెలెక్ట్ చేశారు. వారిలో ప్రదాన పాత్రకు బాలివుడ్ భామ దీపికపదుకొనే ఎంపిక అయ్యిందట. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రెండో హీరొయిన్ గా మలయాళీ అసిన్ చేయనుంది. ఇంకో హీరోయిన్ గా అనుష్క ఉంటుందని సమాచారం. రవికుమార్ ఈచిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు తానంటున్నాడు.  రజినికాంత్ త్రిపాత్రభినయం చేస్తూ ముగ్గురు అందాల భామలు కనువిందు చేయనున్న ఈ చిత్రం ఫై అప్పుడే అంచనాలు పెరిగాయి అనేది వాస్తవం.

Tuesday, February 15, 2011

7/g దర్శకుడు సెల్వరాఘవన్ రెండోపెళ్ళి


7 / జి బృందావన్ కాలనీ సినిమా తో తెలుగు వారికి పరిచయమైనా దర్శకుడు సెల్వరాఘవన్ రెండో పెళ్ళికి సిద్దం అయ్యాడు. ఇది వరకే ఇతడు 7  /జి హీరొయిన్ సోనీ అగర్వాల్ ను వివాహమాడాడు. ఆతరువాత ఏమైందో కానీ వారిద్దరు విడిపోయారు. తనకు తమిళం తెలీకపోయినా రాఘవన్ వాలింట్లో బాగా కలిసిపోయానని సోనీ పలు మార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. అవును ఆమె ఇంట్లో వాళ్ళతో  కలిసిపోయినట్లుగా రాఘవన్ తో మేలగలేకపాయింది. అందుకేనేమో రాఘవన్ తో విడిపోయాక రాఘవన్ వాళ్ళ నాన్న దర్శకత్వం లో నటించింది.


ప్రస్తుతం సోనీ సినిమా లతో బిజీ గావుండగా  రాఘవన్ రెండో పెళ్ళికి ముహూర్తం పెట్టుకొన్నాడు. తన దగ్గరే సహాయకురాలిగా పని చేస్తున్న గీతాంజలి ని సెల్వ వివాహం చేసుకోనున్నాడు. ఈ మద్యనే చెన్నై లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. సెల్వ తో ఒక సినిమా చేసినా వెంకటేష్ కుడా వీరి నిశ్చితా ర్థానికి హాజరయ్యాడు. ఇంకో విశేషం ఏంటంటే సెల్వరాఘవన్ మొదటి వివాహానికి కూడా వీరందరూ హాజరయ్యారు. రాఘవన్, గీతాంజలిల వివాహం జూన్ ౩ న జరుగనుంది.

Monday, February 14, 2011

త్యాగశీలి వమ్మా లలితా...

'ప్రకాష్ రాజ్' విలక్షణ నటుడిగా తెలుగు వారికి పరిచయం ఉన్న వ్యక్తి. సాధారణ స్థాయి నుంచి తిరుగు లేని స్టార్ వరకు ఎదిగిన ప్రకాష్ ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తి అనటంలో కూడా సందేహించాల్సింది లేదు. అయితే ప్రకాష్ రాజ్ వ్యక్తిగతం మాత్రం కొంత వివాదస్పదమైనదే. భార్యతో విడాకులు అనే విషయం కోర్టుకెక్కడం అతన్ని వివాదాల్లోకి నెట్టింది. ఎలాగైతేనం విడాకులు తీసుకొన్న అతను వేరే మహిళను పెళ్లి కూడా చేసుకొన్నాడు. ఇప్పు దు తాజా విషయం ఏంటంటే- నిర్మాత గామారిన ప్రకాష్ రాజ్ ఈ మద్యనే పయనం పేరు తో తమిళం లో ఓ చిత్రాన్ని నిర్మించాడు.( అదే తెలుగులో దిల్ రాజు నిర్మాతగా గగనం పేరుతో విడుదల అయ్యింది) ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అవటానికి ముందు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మహేందర్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్ తనకు 50 లక్షలు అప్పు ఉన్నాడని దాని తీర్చిన తర్వాతే సినిమా రిలీజ్ చేసుకోవాలని కోర్టుకు ఎక్కాడు. దీనిపై కోర్టు కూడా మహేందర్ కు అనుకూలంగా స్టే  ఇచ్చింది. అతనికి డబ్బు చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేసుకోవాలని ప్రకాష్ రాజ్ ను కోర్ట్ ఆదేశించింది. దిక్కు తోచని స్థితి లో పడిన ప్రకాష్ రాజ్ ను ఆదుకోవటానికి ఎవరూ ముందుకురాలేదు. కాని తను కాదనుకొని వదిలి పెట్టిన ఒక చెయ్యే ప్రకాష్ కు ఆసరాను అందించింది. అంటే ప్రకాష్ రాజ్ విడాకులు ఇచ్చి వదిలి పెట్టిన లలితకుమారి అను అతని  మాజీ భార్య సహాయం చేయడానికి ముందుకొచ్చింది. లలితకుమారి తన ఆస్తులన్న్ని తాకట్టు పెట్టి 50 లక్షల సొమ్మును ప్రకాష్ రాజ్ కు  ఇచ్చింది. దాంతో అప్పు తీర్చి సినిమాను విడుదల చేసుకొన్నాడు ప్రకాష్ రాజ్. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. తనను వదిలి పెట్టాడు అనే కోపం లేకుండా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి భర్తకు సహాయం చెసిన లలితకుమారి నిజమైన స్త్రీ మనసును నిరూపించింది కదా......



Friday, February 11, 2011

మన హీరోల చూపు కోలివుడ్ వైపు...

మన హీరో లకు జ్ఞానోదయం అయ్యింది. ఇన్ని రోజులు తెలుగుకే పరిమితం అయిన మన హీరోల చిత్రాలు ఇక నుంచి తమిళం లో కూడా మార్కెట్ చేయనున్నాయి. తాజాగా తెలుగు హీరో జూనియర్ NTR  తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన తాత,దివంగత నటుడు  రామారావు ప్రారంభం లో కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. ఆతరువాత ఆయన తెలుగు తెరకే పరిమితం అయ్యారు. కాని నాగార్జున వంటి కొంతమంది హీరోలు తమిళ ప్రేక్షకులను పలకరించి వచ్చారు. నాగార్జున 'శివ' తమిళంలో 'ఇదయం తిరుదాడే'పేరుతొ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. 'గీతాంజలి' కూడా తమిళ్లోకి అనువాదమైంది. చాలా రోజుల తర్వాత నాగార్జున తమిళ్లో నటించిన 'రాక్షగాన్' ఫెయిల్ అవ్వటంతో మళ్ళి తమిళ్ జోలికి వెళ్ళలేదు. కాని ఆయన చిత్రాలు మాత్రం తమిల్లోకి  అనువాదం అయ్యేవి. ఈ మధ్యకాలంలో  మహేశ్ బాబు   'అతడు' తమిళ్లో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ నాగార్జున 'గగనం' చిత్రం 'పయనం' పేరుతో విడుదల అవుతుంటే. తారక్ నటిస్తున్న 'శక్తి' తెలుగు,తమిళం భాషల్లో ఒకే సారి విడుదల అవ్వటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లో ఇలియానా హీరోయిన్. తమిళ హీరోలు అనువాద చిత్రాలతో తెలుగు తెరపైకి దండెత్తుతుంటే కనీసం మన వాళ్ళు ఇప్పటికైనా మేల్కోవటం సంతోషమే కదా!