Sunday, March 20, 2011

'రెడ్డి గారు పోయారంటున్న' రామ్ గోపాల్ వర్మ....

రామ్ గోపాల్ వర్మ మరో తను చేయబోయే మరో సంచలనాన్ని ప్రకటించారు. ఈ సారి తన అస్త్రం ఆంద్ర రాష్ట్ర రాజకీయాలపై ఎక్కుపెట్టాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం పై సినిమా తర్వాతా కనీసం పాటల తో నైనా సినీ జనాల పై సెటైర్ వేసాడు అప్పలరాజు తో. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్తితు నేపథ్యంతో ''రెడ్డి గారు పోయారు''సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు వర్మ. కనీస సెన్స్ ను ఉపయోగించి ఆలోచించినా అది వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత మలుపులు తిరుగుతోన్న రాష్ట్ర రాజకీయాల పై సెటైర్ అని చెప్పేయొచ్చు. ఎదేమైనా ఈ చిత్రం తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది అనటం లో ఎటు వంటి ఆశ్చర్యం లేదు. ఈ చిత్రం లో చిరంజీవి పాత్ర ఏంటి అనేదాని పై అప్పుడే ఊ హాగానాలు మొదలయ్యాయి. ఇది వరకే కాంగ్రెస్ చిరు పోత్తు లో చిరు హీరో కాదు హీరొయిన్ వంటివాడని వ్యాఖ్యానించిన వర్మ ఇప్పు ఏ నాయకుడిని ఎలా చుపుతాడనే ఆసక్తి నెలకొంది.....

No comments:

Post a Comment