Sunday, January 30, 2011

నగరం నిద్రపోతున్నపుడు వారు కలిశారు!





'అనుకోకుండా ఒకరోజు' చూస్తే.. ఎప్పుడు స్నాక్స్ తింటూ ఓ వ్యక్తి కనిపిస్తారు. గుర్తుందా..? అందులో హీరోయిన్ చార్మిని రక్షిస్తారు. ఇపుడు ఆ ఇద్దరు .. అంటే జగపతి, ఛార్మి హీరో , హీరోయిన్లుగా తొలిచిత్రం (అందులో హీరో కాదు) రాబోతుంది. ఇగోలు లేని హీరోగా పేరుపొందిన జగపతిబాబుతో నటించడానికి చార్మి ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. తాజాగా పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు రాస్తున్న ఆ చిత్రం పేరు 'నగరం నిద్రపోతున్న వేళ'. ఈచిత్రానికి వారి శిష్యుడు ప్రేమ్‌రాజ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇండస్ట్రీ బంద్‌ వల్ల కొంత షూటింగ్‌ జరిగి వాయిదా పడింది. ఈనెల 17న తర్వాత మలి షెడ్యూల్‌ మొదలైంది. జగపతిబాబు, చార్మికాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలతోపాటు ఓ పాటను చిత్రించినట్లు తెలిసింది. ఇప్పటికే 40 శాతం పూర్తయినది. ఈ చిత్రాన్ని ప్రముఖ రియల్టర్‌ నంది శ్రీహరి నిర్మిస్తున్నారు







charmi, jagapathi babu

No comments:

Post a Comment