Wednesday, February 16, 2011

రాణా లో ముగ్గురు రజినీకాంత్ లు.....



రోబో సినిమా తరువాత రజినీకాంత్ రాణా అనే చిత్రానికి సిద్దం అయ్యాడు. రోబోలో సైంటిస్ట్ గా యంత్రుడిగా రెండు పాత్రలు చేసినా రజిని రాణా లో త్రి పాత్రాభినయం చేయనున్నాడు. భారి చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన కే ఏస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ముగ్గురి రజినిల సరసన ముగ్గురు గ్లామర్ బొమ్మలను  కుడా అప్పుడే సెలెక్ట్ చేశారు. వారిలో ప్రదాన పాత్రకు బాలివుడ్ భామ దీపికపదుకొనే ఎంపిక అయ్యిందట. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రెండో హీరొయిన్ గా మలయాళీ అసిన్ చేయనుంది. ఇంకో హీరోయిన్ గా అనుష్క ఉంటుందని సమాచారం. రవికుమార్ ఈచిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు తానంటున్నాడు.  రజినికాంత్ త్రిపాత్రభినయం చేస్తూ ముగ్గురు అందాల భామలు కనువిందు చేయనున్న ఈ చిత్రం ఫై అప్పుడే అంచనాలు పెరిగాయి అనేది వాస్తవం.

No comments:

Post a Comment