Monday, February 14, 2011

త్యాగశీలి వమ్మా లలితా...

'ప్రకాష్ రాజ్' విలక్షణ నటుడిగా తెలుగు వారికి పరిచయం ఉన్న వ్యక్తి. సాధారణ స్థాయి నుంచి తిరుగు లేని స్టార్ వరకు ఎదిగిన ప్రకాష్ ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తి అనటంలో కూడా సందేహించాల్సింది లేదు. అయితే ప్రకాష్ రాజ్ వ్యక్తిగతం మాత్రం కొంత వివాదస్పదమైనదే. భార్యతో విడాకులు అనే విషయం కోర్టుకెక్కడం అతన్ని వివాదాల్లోకి నెట్టింది. ఎలాగైతేనం విడాకులు తీసుకొన్న అతను వేరే మహిళను పెళ్లి కూడా చేసుకొన్నాడు. ఇప్పు దు తాజా విషయం ఏంటంటే- నిర్మాత గామారిన ప్రకాష్ రాజ్ ఈ మద్యనే పయనం పేరు తో తమిళం లో ఓ చిత్రాన్ని నిర్మించాడు.( అదే తెలుగులో దిల్ రాజు నిర్మాతగా గగనం పేరుతో విడుదల అయ్యింది) ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అవటానికి ముందు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మహేందర్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్ తనకు 50 లక్షలు అప్పు ఉన్నాడని దాని తీర్చిన తర్వాతే సినిమా రిలీజ్ చేసుకోవాలని కోర్టుకు ఎక్కాడు. దీనిపై కోర్టు కూడా మహేందర్ కు అనుకూలంగా స్టే  ఇచ్చింది. అతనికి డబ్బు చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేసుకోవాలని ప్రకాష్ రాజ్ ను కోర్ట్ ఆదేశించింది. దిక్కు తోచని స్థితి లో పడిన ప్రకాష్ రాజ్ ను ఆదుకోవటానికి ఎవరూ ముందుకురాలేదు. కాని తను కాదనుకొని వదిలి పెట్టిన ఒక చెయ్యే ప్రకాష్ కు ఆసరాను అందించింది. అంటే ప్రకాష్ రాజ్ విడాకులు ఇచ్చి వదిలి పెట్టిన లలితకుమారి అను అతని  మాజీ భార్య సహాయం చేయడానికి ముందుకొచ్చింది. లలితకుమారి తన ఆస్తులన్న్ని తాకట్టు పెట్టి 50 లక్షల సొమ్మును ప్రకాష్ రాజ్ కు  ఇచ్చింది. దాంతో అప్పు తీర్చి సినిమాను విడుదల చేసుకొన్నాడు ప్రకాష్ రాజ్. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. తనను వదిలి పెట్టాడు అనే కోపం లేకుండా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి భర్తకు సహాయం చెసిన లలితకుమారి నిజమైన స్త్రీ మనసును నిరూపించింది కదా......



No comments:

Post a Comment